మనదేశంలో వివిధ రాష్ట్రాలు భూకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా జమ్ములో ఒకేరోజు నాలుగుసార్లు భూమి కంపించింది. ఇక్కడి కిశ్త్వాడ్ లో బుధవారం ఉదయం గం.8.29 సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 3.3గా నమోదయింది. ఐదు కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అంతకుముందే డోడా జిల్లాలో ఉదయం గం.7.56 సమయానికి భూకంపం సంభవించింది. పది కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అర్ధరాత్రి దాటి తెల్లవారుజామున గం.2.20 సమయానికి ఇదే ప్రాంతంలో 4.3 తీవ్రతతో, ఆ తర్వాత గం.2.34 గంటలకు రైసీ జిల్లాలోని కాట్రాలో 2.8 తీవ్రతతో భూమి కంపించింది. ఒకేరోజు నాలుగుసార్లు భూమి కంపించడం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. నిన్న ఉత్తర భారతంలోని పలుచోట్ల భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa