రాచమల్లు ప్రసాద్రెడ్డికి దమ్ముంటే పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో అక్కడికి వెళ్ళి పోటీ చేయాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు విమర్శించారు. ప్రొద్దుటూరు స్ధానిక చౌడేశ్వరి నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..... మీడియాలో ఫోకస్ కోసమే రాచమల్లు ఆరాటమన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఒకరు రాచమల్లు గురించి కౌన్సిలర్కు ఎక్కువ, చైర్మన్కు తక్కువ ఉన్నోడిని ఎమ్మెల్యేగా గెలిపించటం దౌర్భాగ్యమని అన్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కాదుకదా వార్డు కౌన్సిలర్గా కూడా ఆయన గెలవలేడని ఎద్దేవా చేశారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ల్యాండ్, శాండ్, బియ్యం మాఫియాలు నడిపిస్తున్నాడన్నారు. త్వరలో గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి మాట్లాడుతూ మే 30 నుంచి జూన్ 30 నెలరోజుల వరకు 16 రకాల కార్యక్రమాలను పార్టీ రూపొందించిందన్నారు. త్వరలో ప్రొద్దుటూరు లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ అగ్రనేతలు హాజరవుతున్నారన్నారు. సమావేశంలో బీజేపీ పట్టణ అఽధ్యక్షుడు సుబ్రమణ్యం, కార్యదర్శి నరసింహప్రకాష్ వెంకట సుబ్బయ్య, శరత్ బాబు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa