శబరిమల అయ్యప్ప స్వామి గుడిలో ఆలయసిబ్బంది చేతి వాటం ప్రదర్శించాడు. స్వామికి ఓ భక్తుడు కానుకగా ఇచ్చిన బంగారు నగను ఉద్యోగి కాజేశాడు. మాస పూజల కోసం ఆలయం తెరవగా.. హుండీ వద్ద విధులు నిర్వర్తించిన రెజీ కుమార్ అనే ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. భక్తుడు స్వామివారికి సమర్పించిన 10.95 గ్రాములు బంగారు బ్రాస్లెట్ను తస్కరించాడు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హుండీ వద్ద విధుల్లో ఉన్న వాసుదేవపురం ఆలయ ఉద్యోగి జూన్ 16న దొంగతనానికి పాల్పడ్డాడు. భక్తుడు అందజేసిన బంగారు గాజును ఆలయ అధికారి హుండీలో వేశారు. కానీ, అది ఖజానాలోని లెక్కల్లోకి చేరలేదు. దీంతో విజిలెన్స్ అధికారులకు శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు.
తక్షణమే స్పందించిన విజిలెన్స్.. సబ్-ఇన్స్పెక్టర్ బిజు రాధాకృష్ణన్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. హుండీ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించగా దొంగతనం బయటపడింది. కన్వేర్ బెల్టు ద్వారా హుండీ వద్దకు వస్తున్న బంగారు బ్రాస్లెట్ను రెజీ కుమార్ పక్కకు నెట్టి అక్కడ ఉన్న చెత్తలో పడేలా చేశాడు. అనంతరం దానిని తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. ఈ తతంగం అంతా అక్కడ సీసీటీవీలో రికార్డయ్యింది. దీంతో రెజి కుమార్ ఉన్న గదిని తనిఖీ చేయగా.. దిండు కింద గాజు లభ్యమైంది.
కేసు నమోదుచేసిన అధికారులు.. అతడ్ని పంపా పోలీసులకు అప్పగించారు. సోమవారం అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మలయాళ మాసం మిథునంలో నెలవారీ పూజల కోసం శబరిమల అయ్యప్ప సన్నిధానం జూన్ 15న సాయంత్రం 5 గంటలకు తెరిచారు. తంత్రి కందరారు రాజీవరారు ఆధ్వర్యంలో మేల్సంతి జయరామ్ నంబూద్రీ అయ్యప్ప ఆలయాన్ని, మాలికాపురం పూజారి వి హరికృష్ణన్ నంబూద్రీ మాలికాపురత్తమ్మ ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మర్నాడు ఉదయం నుంచి భక్తులను దర్శనం కోసం అనుమతించారు. మంగళవారం రాత్రి ఆలయాన్ని మూసివేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa