ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ తో ఎందుకు కలిశానో ముందు రోజుల్లో తెలుస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 11:06 AM

కాకినాడ ముత్తాక్లబ్‌లో పవన్‌ కల్యాణ్‌ ముస్లిం ప్రతినిధులతో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....  దేశంలో సమాజం వేరు, రాజకీయ పార్టీలు వేరని, మైనార్టీలు అనగానే సంపూర్ణంగా అవకాశాలుండవనే భావన మన మనస్సుల్లోంచి తొలగించాలని కోరారు. 2019 ఎన్నికల్లో ముస్లింలు వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారని, ఉభయసభల్లో కలిపి ఆ పార్టీకి 30 మంది ఎంపీలు ఉన్నారు. 25 ఎంపీలు ఇస్తే బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన సీఎం జగన్‌ ఢిల్లీకి వెళ్లి ఏం వంచుతున్నాడో, ఎవరు వంచుతున్నారో తెలిసిందేనన్నారు. బీజేపీ అడిగినా అడగకపోయినా ఉభయ సభల్లో ఆ పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. దాంతో రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. తాను వైసీపీలా గుడ్డిగా బీజేపీకి ఒత్తాసు పలకడం జరగదని స్పష్టంచేశారు. మీకు ఆ విషయం నిలకడగా తెలుస్తుందన్నారు. కాగా జనసేన మేనిఫెస్టోలో సచార్‌ కమిటీ సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని, ప్రతీ అంశం అమలయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆ పార్టీ పీఏసీ రాష్ట్ర చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నయూబ్‌ కమల్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. పార్టీ నేతలు అర్హంఖాన్‌, కందుల దుర్గేష్‌, పంతం నానాజీ, ముత్తా శశిధర్‌లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa