తమిళనాడులోని కోవై - కొలంబో మధ్య త్వరలో విమాన సేవలు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రూట్లో 2003-08 మధ్య విమాన సేవలు సాగాయి. వివిధ కారణాలతో ఆ సేవలు నిలిచిపోగా, 2017లో శ్రీలంకన్ ఎయిర్లైన్స్ సంస్థ ఈ సేవల్ని పునరుద్ధరించింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఆ సేవలు మళ్లీ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మూడేళ్ల అనంతరం మళ్లీ కోవై - కొలంబో మధ్య విమాన సేవలు పునఃప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa