ఏలూరులో యాసిడ్ దాడి బాధితురాలు ఎడ్ల ఫ్రాన్సిక కన్నుమూసింది. గత మంగళవారం (జూన్ 13) ఏలూరులో ఆమెపై యాసిడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆమె విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం ఉదయం ప్రాణాలు విడిచింది. ఫ్రాన్సిక మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.
ఏలూరులోని జెవియర్ నగర్లో నివాసం ఉంటున్న ఎడ్ల ఫ్రాన్సిక దుగ్గిరాల సమీపంలోని డెంటల్ కాలేజీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె భర్త రాజమండ్రిలో కెమికల్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకోగా.. ఆ తర్వాత విభేదాలు రావడంతో రెండేళ్లుగా ర్తతో విడిపోయి కూతురితో కలిసి తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. గత మంగళవారం రాత్రి ఫ్రాన్సిక విధులు ముగించుకుని బైక్పై ఇంటికి బయల్దేరింది.
ఫ్రాన్సిక ఇంటికి సమీపంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్తో దాడి చేశారు. ఆమె తల, ముఖానికి తీవ్ర గాయాలు కాగా.. ఆమె భయంతో పరుగులు తీస్తూ ఇంటికి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ముందు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అనంతరం విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఫ్రాన్సిక అక్కడ చికిత్స పొందుతూ ఇప్పుడు చనిపోయింది.
ఈ యాసిడ్ దాడి చేసిన కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బోడా నాగ సతీష్, బెహర మోహన్, బూడిద ఉషాకిరణ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రమాదకరమైన యాసిడ్ను తన బంగారుపని అవసరం నిమిత్తం అని చెప్పి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఏలూరు కత్తేపువీధికి చెందిన షేక్ ఖాజాబాబును ఏలూరు దిశ పోలీసులు అరెస్టు చేశారు. ఆ యాసిడ్ను ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్నందుకు ఏలూరు గడియారస్తంభం ప్రాంతానికి చెందిన కిరాణాషాపు వ్యాపారి త్రివిక్రమరావు, గుమస్తా సత్యనారాయణలను అరెస్టు చేశారు. ఆమెపై యాసిడ్ దాడి జరగడానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు కొసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa