ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అనే దిశగా అప్పటి సీఎం చంద్రబాబు పనిచేశారు’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... ‘‘ఇప్పటికైనా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పైశాచికత్వం, అరాచకాలను ఆపాలి. గతంలో నన్ను ఎత్తుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. ఇప్పుడు రామోజీరావును వేధిస్తున్నారు. మార్గదర్శి సంస్థతోపాటు.. చందాదారుల గురించి సీఐడీ చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. పొత్తులపై పవన్ కల్యాణ్ స్పష్టతతో ఉండగా, జగన్మోహన్రెడ్డి మాత్రం తీవ్ర అయోమయం, గందరగోళంలో ఉన్నారు. పవన్ కల్యాణ్పై వైసీపీ లోని కాపు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను కూడా కాపు నేతలతో తిప్పికొట్టించే బదులు, రెడ్డి నాయకుల చేత ఎందుకని ఖండింపచేయడం లేదో జగన్మోహన్రెడ్డి చెప్పాలి. ఒకే కులం నేతల మధ్య చిచ్చు పెట్టి చలి మంటలు కాచుకోవడం జగన్మోహన్రెడ్డికి అలవాటే’’ అని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa