కాపు ఉద్యమం సమయంలో ఉప్మా తిన్న పాపానికి ముద్రగడ పద్మనాభానికి సొమ్ములు పంపిస్తున్నామని జనసేన నేతలు ప్రకటించారు. కాకినాడ జిల్లా కరపలో గురువారం పోస్టాఫీసు వద్దకు వెళ్లి ముద్రగడ పేరు మీద వారంతా మనియార్డర్లు పంపించారు. జనసేన పీఏసీ సభ్యుడు, కాకినాడ రూరల్ సభ్యుడు పంతం నానాజీ పిలుపు మేరకు దాదాపు 30మంది జనసైనికులు రూ.50 నుంచి రూ.500 వరకు ఎం.ఒ.చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ముద్రగడ రాసిన లేఖ, చేస్తున్న వ్యాఖ్యలకు వారిలా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారు మురళీ, భోగిరెడ్డి గంగాధర్,భోగిరెడ్డి కొండబాబు, ముద్రగడ రమేశ్, యాళ్ల పండు, పి.దుర్గాప్రసాద్, బిరుదాబాబు, రెడ్డి బుజ్జి, బుద్దాల శ్రీను పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa