గత నెలలో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన కంచరపాలెం పరిధిలో సోమవారం వెలుగు చూసింది. ఈమేరకు ఐదవపట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గవర కంచరపాలెం ప్రాంతంలో నివాసముంటున్న సూరిశెట్టి కాశీవిశ్వనాధ్ ఆటోనగర్లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇతనికి 2016లో వివాహం జరిగింది.
వీరి మధ్యలో ఎటువంటి తగాదాలు లేవు అయితే సదరు వ్యక్తి ఫోన్లో బెట్టింగులు ఆడేవాడు గత నెల 15న పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సదరు వ్యక్తి తండ్రి సూరిశెట్టి రాము ఆదివారం కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఎస్ విజయ్ కుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa