ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్మోహన్ రెడ్డి జోలికొచ్చే పెత్తందార్ల సంగతి తేలుస్తాం: జోగి రమేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 06:16 PM

పేద ప్రజల పక్షాన నిలబడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి జోలికొచ్చే పెత్తందార్ల సంగతి తేలుస్తామని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి జోగి రమేష్ సీరియస్ వార్నింగ్‌ ఇచ్చారు. కృష్ణా జిల్లా పామర్రులో 4వ విడత కృష్ణా జిల్లా స్థాయి అమ్మ ఒడి నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో 1,29,533 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ. 168.33 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.


పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు మనసు పెట్టి కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా వాటిని పరిష్కరిస్తున్నారని జోగి రమేష్ తెలిపారు. రోడ్ల వెంబడి తిరిగే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్.. మంచి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని పిచ్చి వాగుడు వాగుతున్నారని దుయ్యబట్టారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసినా కూడా, ప్రజల కష్టాలను పరిష్కరించలేని దౌర్భాగ్యుడు చంద్రబాబునాయుడు అని ఫైరయ్యారు.


ఇక, పేదల ప్రజల పక్షాన కష్టపడే జగన్ జోలికి వచ్చే పెత్తాందార్ల సంగతి తెలుస్తామని జోగి రమేష్ వార్నింగ్‌ ఇచ్చారు. పెత్తాందార్ల కోటలు బద్దలు కొట్టే సత్తా పేద ప్రజలకు ఉందని.. ప్రజల మద్దతుతో 20 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డే సీఎంగా ఉంటారని పేర్కొన్నారు. పెత్తాందార్ల పిల్లలు విదేశాలకు వెళ్లి ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు.. కానీ, పేద వర్గాల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువును అడ్డుకునేలా కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పని చేసే జగనన్న ప్రభుత్వంలోనే ప్రజలకు కావాల్సినవన్నీ జరుగుతాయని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మనసు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని.. గత ప్రభుత్వం త్రీడీ, రాజమౌళి సెట్టింగ్‌లకే పరిమితమైందని ఆరోపణలు గుప్పించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa