రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో వచ్చేనెల 16న ఉదయం 10 గంటలకు విద్యాపరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నామని బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు సానబోయిన రామారావు తెలిపారు. స్థానిక ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మాట్లాడారు. సదస్సుకు ఏపీ విద్యాపరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ డి.రమేష్ పట్నాయక్ గుంటూరు నుంచి హాజరవుతారని చెప్పారు. ఈ సదస్సులో విద్యారంగ సమస్యలపై చర్చిస్తామన్నారు.సంఘం వైస్ చైర్మన్ ఎల్వీ.ప్రసాదరావు, గౌరవాధ్యక్షుడు కెకె.సంజీవరావు, జిల్లా అధ్యక్షుడు బి.జార్జి ఆంటోని, రాష్ట్ర నాయకులు మేడిశెట్టి తాతబ్బాయి, కోనాల లాజర్, మట్టపర్తి సత్యనారాయణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa