నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని స్థానిక నందికొట్కూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు పకీర్ సాబ్ అధ్యక్షతన స్థానిక సిపిఎం కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా పాత బస్టాండ్ పటేల్ సెంటర్ మీదుగా విద్యుత్ సబ్స్టేషన్ చేరుకొని పెరిగిన విద్యుత్ బిల్లులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పెంచిన విద్యుత్ బిల్లులు వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ ట్రూ అప్ సర్దుబాటు చార్జీలు వసూలు నిలిపివేయాలని, స్మార్ట్ మీటర్ లను పెట్టరాదని,డిస్కములను ప్రైవేటీకరన చేయరాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై గత సంవత్సరం కరెంటు చార్జీలు పెంచి 1400 కోట్ల రూపాయలు భారం ప్రజలపై మోపిందని,మోడీ ప్రభుత్వం ఆదేశాల మేరకే జగన్ ప్రభుత్వం ప్రతినెల కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారని,కరెంట్ బిల్లులో ఫిక్స్ చార్జీలు, కస్టమర్ చార్జీలు,సర్ చార్జీలు,విద్యుత్ సుంకం, సర్దుబాటు చార్జీల పేర్లు పెట్టి ప్రజల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని,గతంలో తెలుగుదేశ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఆదేశాలకు లొంగి విద్యుత్ రంగాన్ని మూడు ముక్కలు చేసి సంస్కరణల పేరుతో చార్జీలు పెంచితే కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలబడి ప్రాణ త్యాగాలు చేసి పోరాడారని,కాంగ్రెస్ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిరాహార దీక్ష చేశారని కానీ ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజలు తిరస్కరించిన విధానాలనే అమలు చేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని,తక్షణమే విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే మరో విద్యుత్ ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బెస్తరాజు, గోపాలకృష్ణ,ఎం కర్ణ, రంగమ్మ,సాజిదాబి,ప్రజా సంఘాల నాయకులు రాము,సురేష్,నరసింహులు,రామిరెడ్డి,శివ, నారాయణ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa