పవన్ కళ్యాణ్ పంది మీద ఊరేగుతున్న పిచ్చికుక్క అని.. పెళ్లిళ్ల వీరుడంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. భీమవరం వేదికగా ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై శనివారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో పెద్దలలో పవన్ను సన్నిహిత సంబంధాలు ఉంటే రాష్ట్రానికి మేలు చేయ్యాలని హితవు పలికారు. అంతే గాని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే బెదిరిస్తున్నావా అంటూ ఫైరయ్యారు.
మతి భ్రమించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. ఒక పిచ్చి కుక్క లాంటి వాడని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాలను చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలన్నారు. జగన్పై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడకుండా పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అంతేగాని నలుగురు విప్లవ కారులు పేర్లు తెలిస్తే నువ్వు విప్లవ కారుడివా అని పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. వివాహ వ్యవస్థలో ఏమైనా విప్లవం తెచ్చావా అంటూ సెటైర్లు వేశారు.
వివాహ వ్యవస్థపై పవన్కు నమ్మకం లేదని.. ఆయనొక పెళ్లిళ్ల వీరుడంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ప్రజలకు నీతులు చెప్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పేద ప్రజలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న పోరాటంలో సీఎం జగన్ పేదల పక్షాన నిలబడితే పవన్ కళ్యాణ్ మాత్రం, పెత్తందారుడైన చంద్రబాబు పక్కన చేరారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాటలు సంస్కార హీనంగా ఉన్నాయని.. ఆయన తన మాటలతో అసాంఘిక శక్తులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. పవన్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తెలియని వ్యక్తి అని.. తప్పులన్నీ ఆయన దగ్గర పెట్టుకుని ఎదుటి వారిని దూషించే మనస్తత్వం ఆయనిదని ఫైరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa