ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త 108 అంబులెన్స్లను ప్రారంభించారు. 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా.. కొత్తగా 146 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం దగ్గర జెండా ఊపి ప్రారంభించారు. జగన్ సర్కార్ 2020లోనే మండలానికి ఒక 108 అంబులెన్స్ను సమకూర్చింది.. తాజాగా రూ.34.79 కోట్లతో 146 అంబులెన్స్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
గతంలోనే 412 కొత్త అంబులెన్స్లను రూ.96.50 కోట్లతో అధునాతన సౌకర్యాలతో కొనుగోలు చేసింది. అప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేసి 748 అంబులెన్స్లతో సేవలను విస్తరించారు. గత అక్టోబర్లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం రూ.4.76 కోట్లతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్స్లు రోజుకు దాదాపు 3వేలకుపైగా కేసుల్ని అటెండ్ అవుతున్నాయి. 2020 జులై నుంచి ఇప్పటి వరకు 33,35,670 ఎమర్జెన్సీ కేసుల్లో అంబులెన్స్లు సేవలందించాయి. సేవలు వినియోగించుకున్న వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు, రోడ్డు, ఇతర ప్రమాదాల బాధితులు ఉన్నారు. 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa