గతానికి భిన్నంగా బీజేపీ నాయకత్వం ప్రస్తుతం అడుగులేస్తోంది. ఎన్నికలకు కొన్ని నెలలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూకుడు పెంచింది. బీజేపీని నమ్ముకుంటూ వచ్చిన పెద్ద నాయకులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వారికి కీలక పదవులను కట్టబెట్టింది. ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అధిష్టానం కీలక పదవి అప్పగించింది. జాతీయ కార్యవర్గంలో ఆయనకు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కిరణ్ కుమార్ రెడ్డిని నియమించింది. తద్వారా ఆయన సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోనుంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలావుంటే మరో 9 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ అధిష్టానం కీలక నియామకాలు చేపట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది. సోము వీర్రాజు పదవీ కాలం ముగియడంతో ఈ నియామకం చేపట్టింది. దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa