ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని, కేంద్ర హోంమంత్రితో వై.ఎస్.జగన్ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 05, 2023, 07:41 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సీఎం జగన్‌.. సుమారు గంటన్నర పాటు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.


అంతకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో కూడా భేటీ అయ్యారు. 45 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ నిధులపై కూడా అమిత్‌ షాతో సీఎం జగన్‌ చర్చించినట్లు సమాచారం.


మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహాయం, పోలవరం నిధులు, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి స్వాగతం పలికారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa