అన్నమయ్య తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు లారీ కిందికి చొచ్చుకుపోగా.. నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు స్పాట్లోనే ప్రాణాలు వదిలారు. ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న.. పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
అయితే.. తిరుమల నుంచి శ్రీకాళహస్తి వెళ్తుండగా మిట్టకండ్రిగ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉండగా.. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా విజయవాడకు చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకుని విజయవాడకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో రహదారి మొత్తం రక్తసిక్తమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa