పల్నాడు జిల్లా రాజుపాలెంలో విషాదం నెలకొంది. రాజపాలెం ఎస్ఐ మేర్లపాక నారాయణ భార్య లక్ష్మీగీత(28) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్య ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఎస్ఐ నారాయణను కూడా ప్రశ్నిస్తున్నారు.
చిట్టమూరు మండలం గుణపాకకు చెందిన నారాయణతో రేణిగుంటకు చెందిన లక్ష్మీగీతకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు సంతానంగా నేత్ర, చైత్ర అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేత్రకు మూడేళ్లు నిండగా.. చేత్రకు ఏడాది వయస్సు ఉంటుంది. అయితే శనివారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో లక్ష్మీగీత క్షణికావేశంలో రూమ్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుని చీరతో ఫ్యాన్కు ఉరేసుకుంది. భర్త నారాయణ వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. భార్య ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది.
లక్ష్మీగీతను స్థానికుల సహాయంతో వెంటనే పిడుగురాళ్లలోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి నారాయణ తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మీగీత మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కూతురు చైత్ర బర్త్ డే సోమవారం ఉన్న నేపథ్యంలో తల్లి మరణించడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చైత్ర బర్త్ డేను తన స్వగ్రామంలో ఘనంగా జరుపుకోవాలని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఊరెళ్లేందుకు ఎస్సై నారాయణ సెలవులు కూడా తీసుకున్నారు. చైత్రకు కొత్తు దుస్తులు కొనుగోలు చేయడానికి శనివారం గుంటూరు వెళ్లాలని అనుకున్నారు. ఇంతలోపే లక్ష్మీగీత సూసైడ్ చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa