జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు మంగళవారం మంత్రి ధర్మాన మీడియాతో మాట్లాడారు. గ్రామ, వార్డు వాలంటీర్లపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓవైపు వాలంటీర్లు, మరోవైపు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. పరోక్షంగా జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు. వాలంటీర్లు రాత్రి అనక , పగలనక పని చేస్తుంటే వారిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యత లేని వారే వాలంటీర్లపై మాట్లాడుతున్నారని వివమర్శించారు. ఎవరో బ్రోకర్ వెధవ అన్నాడని, పనికి మాలినోడి మాటల్ని పట్టించుకోవద్దని వ్యాఖ్యానించారు.
సమాజంలో వేస్ట్ టికెట్లు, చీడ పురుగులు తిరుగుతూ ఉంటాయని.. మంచి పని చేసే వారికి పోరంబోకులు తగులుతుంటారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర వ్యాఖ్యలు చేవారు. నిన్న ఓ పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని.. వారికేమీ తెలిదు అని ఎద్దేవా చేశారు. నాలుగు గోడల మధ్య సినిమాలు తీసేవాడు గొప్పగా ఫీలవుతూ ఉంటారన్నారు. యాక్షన్లు చేయడం గొప్పకాదని.. నిజ జీవితం గొప్ప అని హితబోధ చేశారు. వాలంటీర్లను విమర్శించారంటేనే ఆయన స్థాయి ఏంటో మనకి అర్థమైపోతుందంటూ పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి ధర్మాన ప్రసాదరావు సెటైర్లు వేశారు. అలాంటి వారిని విమర్శించడం తన స్థాయికి కూడా తగదంటూ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa