ఈ నెల 8వ తేదీ కళ్యాణదుర్గం పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి హెలీప్యాడ్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆ సమయంలో పార్టీ ఉరవకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ వై.విశ్వేశ్వరరెడ్డి చొరవతో ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామానికి చెందిన గంగేలి కల్పన సీఎంను కలసి తన కష్టాన్ని చెప్పుకుంది. తన భర్త సిద్ధయ్య గుండె జబ్బుతో మరణించాడని... ఇంటి పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నామని... తమ కుటుంబానికి అండగా నిలవాలని విలపించింది. ఆమె కష్టానికి చలించిన సీఎం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ ఎమ్.గౌతమిని ఆదేశించారు. దీంతో కలెక్టర్ మంగళవారం రెవెన్యూ భవన్లో కల్పనకు రూ.2 లక్షల ఆర్థిక సాయం చెక్ను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ గాయత్రీ దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్కు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa