ఏపీ ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్డీఏ పరిధిలోని ఆర్5 జోన్లో 47 వేల ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. అలాగే, రాష్ట్రంలో అసైన్మెంట్, నిరుపేదలకు ఇచ్చిన భూములు, లంక భూములకు సంబంధించిన పూర్తి హక్కులు లబ్ధిదారులకే కేటాయించాలని నిర్ణయించింది. మూడున్నర గంటలపాటు సాగిన కేబినెట్ భేటీలో 55 అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
అసైన్డ్ ల్యాండ్ పొందిన లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ, విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి.
మొత్తం 63,191,84 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్, లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఒరిజినల్ అసైనీలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఒరిజినల్ అసైనీలు కాలం చేస్తే.. వారి వారసులకు ఈ నిబంధన వర్తిస్తుంది.
ఇక, 1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటునకు కేబినెట్ నిర్ణయిం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలు మాఫీ! తద్వారా పూర్తి హక్కుల కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన క్లియరెన్స్తో.. అమరావతి సీఆర్డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
యూనివర్సీటీల్లో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
రాష్ట్రంలో అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగుల్లాగే దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
టోఫెల్ పరీక్షలకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు శిక్షణ కోసం ప్రముఖ విద్యా సంస్థ ఈటీఎస్తో చేసుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
కర్నూల్లో కేన్సర్ ఇన్స్టిట్యూట్కు 247 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
జూలైలో చేపట్టబోయే పలు సంక్షేమ పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa