విశాఖ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేయడం ఆయన తొందర పాటు చర్య అని.. ఏ విషయమైనా తనతో చర్చించి ఉంటే బాగుండేదని వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. పార్టీలో ఆవిర్భావం నుంచి చాలా మంది ఉన్నారని.. సీఎంను కలవాలి అన్నప్పుడు తనతో మాట్లాడితే తప్పకుండా చర్చించేవాళ్లమన్నారు. ఇవాళ విశాఖపట్నం గురజాడ కాళాక్షేత్రం లో మెప్మా అర్బన్ మార్కెట్ ను వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa