పవన్ కల్యాణ్ దళపతి కాదు దళారీ అని , చంద్రబాబు కోసం ఢిల్లీలో పవన్ కల్యాణ్ దళారీగా మారాడని, తన తల్లిని తిట్టించిన వ్యక్తి కోసం పవన్ దళారీగా మారడం సిగ్గుచేటని పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. విజయవాడలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ కోసం పనిచేస్తున్నాడు కానీ, ప్రజల కోసం పనిచేయడం లేదని కాపులు, జనసేన కార్యకర్తలు తెలుసుకోవాలన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలకు, కాపు సామాజిక వర్గానికి పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దిగజారుడు, అవకాశవాద రాజకీయాలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఎన్టీయే సమావేశానికి పిలవకుండా పక్కనబెట్టారన్నారు. ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నాదెండ్ల మనోహర్ చెబుతారని పవన్ మాట్లాడటం సిగ్గుచేటని, కనీస అవగాహన లేకుండా రాజకీయ పార్టీ ఎందుకు పెట్టినట్టు అని పవన్ను మంత్రి రోజా ప్రశ్నించారు. సినిమాల్లో రైటర్స్ రాసిచ్చింది.. మీటింగ్స్లో చంద్రబాబు స్క్రిప్టు మాత్రమే చదువుతావా..? అని నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa