ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తప్తంతో యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2023, 03:17 PM

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కాటవరం గ్రామానికి చెందిన బోమాటి ఉదయశంకర్‌ (15) ఈ ఏడాది పదో తరగతి పాసయ్యాడు. ప్రైవేటు కళాశాలలో చదువుకుంటానని చెప్పడంతో.. ఈ సంవత్సరం ఇల్లు కడుతున్నాం కదా.. వచ్చే సంవత్సరం కాలేజీకి వెళ్దువుగాని.. అని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో తన చదువు ఆగిపోతుందని ఉదయ్‌శంకర్‌ మానసికంగా కుంగిపోయాడు. బుధవారం తల్లిదండ్రులు పొరుగూరు వెళ్లిన సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు తిరిగి వచ్చి తలుపులు తీసేసరికి దూలానికి వేలాడుతున్న కుమారుడిని చూసి నిర్ఘాంతపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa