కమలంతో చేతులు కలపడం జనసేనకు ఆత్మహత్యా సదృశ్యమే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బీజేపీతో పొత్తులు చాలా ప్రమాదకరమని చెప్పారు. ‘‘ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయంలో మాకో విధానం ఉంది. దాని ప్రకారం ముందుకు వెళతాం. బీజేపీ రాష్ట్రంలో ఎలాగూ లేదు. కేంద్రంలో దానిని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పొత్తులు ఉంటాయి. రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీకి మద్దతిచ్చే పార్టీలతో పొత్తులకు వెళ్లే ఆలోచన లేదు. దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదు. ఉమ్మడి పౌర స్మృతిలో ఏముందో మాకు తెలియదని సీఎం జగన్మోహన్రెడ్డి అనడం విచారకరం. ఇప్పటి వరకూ బీజేపీతో జతకట్టిన ఏ పార్టీ కూడా ఏ రాష్ట్రంలోనూ బతికి బట్టకట్టలేదు’’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa