ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మంగళగిరిలో ఓ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ సమయంలో ఆ ఇద్దరూ 11 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. విషయం బయటికి చెప్పినా, పోలీసులకు చెప్పినా చంపేస్తామంటూ బెదిరించారు. కాగా శుక్రవారం మరోమారు ఆ బాలికపై అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa