త్వరలో 1500 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తాజాగా వెల్లడించారు. ఇప్పటికే వీటికి టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు. అలాగే మరో వెయ్యి విద్యుత్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు త్వరలో అద్దె బస్సుల సంఖ్యను మరింత పెంచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు ఆర్టీసీ డిపోను తిరుమలరావు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. ఉద్యోగులు, కార్మికులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, తాగునీరు, వాష్రూమ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. త్వరలోనే 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చనున్నట్లు తెలిపారు. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింతగా ఉపయోగపడతాయని, ప్రజారవాణా మరింత మెరుగవుతుందని వ్యాఖ్యానించారు.
అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై ఇటీవల కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా.. త్వరలోనే ఒడిశా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనున్నట్లు తిరుమలరావు తెలిపారు. ఎక్కువ అంతరాష్ట్ర సర్వీసులు కలిగిన సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఉంటుందన్నారు. ఇక వైద్య సేవల కోసం నర్సరావుపేట, అలిపిరిలో డిస్పెన్సరీలు ఏర్పాటు చేయయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీకి ఉన్న పాత బకాయిలు అన్నీ చెల్లించామన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత అధిక ఒత్తిడితోనే పనిచేసేది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అని తిరుమలరావు పేర్కొన్నారు. పాత విధానం ప్రకారమే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయని, కారుణ్య నియామకాలు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa