ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పక్కన ఉంటే.. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాత్రం పెత్తందార్ల వైపు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ఈ మేరకు శనివారం ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పేదల పక్కన సీఎం జగన్ ఉన్న విషయాన్ని తట్టుకోలేక చంద్రబాబు తమ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ఇక, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబునాయుడికి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కుప్పంలో తనను పెద్దిరెడ్డి ఓడిస్తాడని చంద్రబాబు భయపడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు.
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు, అవమానాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను చంద్రబాబు అన్ని రకాలుగాను మోసం చేశారని చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వంలో తమ వర్గాలన్నీ సంతోషంగా, గౌరవంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఆపాలని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. లేకపోతే మీకు తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే చంద్రబాబునాయుడు, లోకేష్కు సరైన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు నిశ్చయించుకున్నారని ఎంపీ చెప్పారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలో వస్తామని నందిగం సురేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లకు 175 గెలుస్తామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa