ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే రెండూ ఎత్తిపోయాయ్,,,, బైరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2023, 08:49 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్ని పర్యటనలు చేస్తున్నా.. తనని పట్టించుకునే వారు లేకపోవడంతో పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు.


రాష్ట్రంలో వాలంటీర్లు రూ. 5 వేల గౌరవ వేతనం తీసుకుని, ప్రజలకు సేవలు అందిస్తున్నారని బైరెడ్డి అన్నారు. అలాంటి వాలంటీర్ల వల్ల డేటా చౌర్యం జరుగుతుందనటం సరికాదన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎవరూ ప్రశ్నించలేదని మండిపడ్డారు. ఏపీలో కుళ్లిపోయిన పార్టీ తెలుగు దేశం అని.. అలాంటి పార్టీతో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్‌ కళ్యాణ్‌కు ఓటు వేయాలని ఏపీలో ఎవరూ అనుకోవడం లేదన్నారు. సినిమాల్లో పొలిటికల్ డైలాగులు.. పాలిటిక్స్‌లో సినిమా డైలాగులు చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారని.. అందుకే రెండూ ఎత్తిపోయాయని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందు మంగళగిరి సంగతి చూసుకోవాలని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఏపీలో పథకాలను ఎలా అమలు చేస్తున్నారో నేరుగా ప్రజలనే అడగాలన్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన వల్ల ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టయినా ప్రారంభించి, పూర్తి చేసింది లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ మూడువైపులా తిరుగుతూ.. విష ప్రచారాలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.


ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మానుకోవాలని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హితవు పలికారు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పాలే కానీ.. మీ అంతు చూస్తామని మాట్లాడటం సరికాదని చంద్రబాబు, లోకేష్‌కు హితవుపలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa