ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్ పాదయత్రకి అన్ని ఏర్పాట్లు చేసాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2023, 04:02 PM

పల్నాడు జిల్లాలో నారా లోకేష్ యువగళం ప్రభంజనం సృష్టించబోతుందని టీడీపీ నేతలు జీవీ. ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘రేపు పల్నాడులోకి యువగళం ప్రవేశిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు, వేలాది మందితో ఘనస్వాగతం పలుకుతాం. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 7 నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుంది. వైసీపీ పాలనలో ప్రాజెక్టులను పడకేయించారు. ప్రాజెక్టులపై టీడీపీ వ్యయం చేసిన దాంట్లో 20 శాతం కూడా ఖర్చు పెట్టలేదు. జగన్ కమీషన్లు దండుకొని బిల్లులను మంజూరు చేశారు. చంద్రబాబు ప్రాజెక్టులపై రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టారు. తుది దశలో ఉన్న ప్రాజెక్టులను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మార్గదర్శిపై జగన్ కక్షసాధింపులను తెలుగు వారంతా గమనిస్తున్నారు.  తప్పులు చేస్తున్న అధికారులు భవిష్యత్తులు మూల్యం చెల్లించుకుంటారు.’’ అని నేతలు హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa