టీడీపీతోనే మహిళలకు ఆర్థిక స్వావ లంబన సాధ్యమని టీడీపీ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ తెలిపారు. ఆమదాలవలసలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా శక్తిపథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జగన్రెడ్డి పాలనలో ఆడపడుచులు తీవ్రంగా మోసానికి గురయ్యారని తెలిపారు. చంద్రబాబునాయుడు ప్రకటించిన మహిళాశక్తి పథకం గురించి వివరించారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్పర్సన్ తమ్మినేని గీత, తెలుగుమహిళా జిల్లా అధ్యక్షురాలు మెట్ట సుజాత, బోయిన సునీత, గుడ్ల రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa