ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉప్పరపాలెంలో పొలంబడి కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2023, 07:22 PM

పొన్నూరు మండలం ఉప్పరపాలెం గ్రామం లో డాక్టర్ వైయస్సార్ పొలంబడి కార్యక్రమం శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో మండలం వ్యవసాయాధికారి డేగల వెంకట్రామయ్య పాల్గొని మానవుని ఆరోగ్యం పై పురుగుమందుల ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు. వరివిత్తన శుద్ధి, మొలక శాతం, ఆహారపు గొలుసు దాని ప్రత్యేకత గురించి తెలియజేశారు. గ్రామ సర్పంచ్ ముద్రబోయిన తిరుపతయ్య, పొలంబడిరైతులు, ఆర్ బి కే గ్రామ వ్యవసాయ సహాయకులు హాజరైనారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa