గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైయస్ జగన్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురజపులంక, కూనలంక గ్రామాల్లో వరద బాధితులను సీఎం వైయస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని కోరారు. గతంలో పేపర్లో ఫొటోలు వస్తే చాలు అనుకునేవారు.. కానీ ఇప్పుడు ఇలా కాదు, వారం రోజులు జిల్లా కలెక్టర్లకు సమయం ఇచ్చాం. వరద బాధితులందరికీ సాయం అందించాలని ఆదేశించాం. నేనే స్వయంగా వచ్చి వరద బాధితులను కలుస్తా అని చెప్పా. రెండు రోజులుగా వరద బాధితులతో మాట్లాడుతున్నానని సీఎం పేర్కొన్నారు. తక్కువ డ్యామేజీ జరిగినా రూ.10 వేలు ఇవ్వాల్సిందేనని చెప్పాను. ప్రతి గ్రామంలో విలేజీ క్లినిక్తో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలు ఆర్బీకేల్లో పొందుపరుస్తామన్నారు. ఎవరి పేరు అయినా మిస్ అయితే ఆర్బీకేల్లో ఫిర్యాదు చేయండని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa