విశాఖ పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ రుషికొండ దగ్గరకు వెళ్లారు. దగ్గరకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కాలినడకన వెళ్లి రోడ్డు మీద నుంచి పరిశీలించారు. పవన్ వెంట జనసైనికులు భారీ సంఖ్యలో వచ్చారు. పవన్ వాహనాలను కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో జనసైనికులు వాగ్వాదానికి దిగడంతో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
మీడియాకు రుషికొండను చూపించిన పవన్.. ఈ సందర్భంగా జగన్పై మండిపడ్డారు. ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారని, ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైసీపీ నేతల కళ్లు పడ్డాయని ఆరోపించారు. వైసీపీ నేతల దోపిడీ గురించి ప్రజలందరికీ తెలియాలని, రుషికొండకు అన్ని అనుమతులు వచ్చాయా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని, క్యాంప్ ఆఫీస్ కోసం రుషికొండను తవ్వేశారని ఆరోపించారు. జగన్కు ఎన్ని ఇల్లు కావాలని ప్రశ్నించారు. తెలంగాణను కూడా ఇలాగే దోపిడీ చేశారని, అందుకే తన్ని తరిమేశారని తెలిపారు.
రుషికొండలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని, చట్టాలను రక్షించాల్సిన పాలకులే చట్టాలను ఉల్లంఘిస్తున్నారని పవన్ ఆరోపించారు. రుషికొండను దశాబ్ధాలుగా కాపాడుకున్నామని, తుపాన్లు వచ్చినప్పుడు రుషికొండ కాపాడుతోందన్నారు. మూడు రాజధానులు అంటున్నారని, ఒక్క రాజధానికే దిక్కు లేదని ఆరోపించారు. కిర్లంపూడిలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవచ్చని, రుషికొండను తవ్వడం ఎందుకని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa