ఏపీ గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలుగా వైఎస్సార్సీపీ నుంచి కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు నియమితులయ్యారు. చదిపిరాళ్ల శివనాథరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ గతనెలలో ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయ్యింది. వీరి స్థానంలో పద్మశ్రీ, కుంభా రవిబాబు పేర్లను జగన్ సర్కార్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు సిఫార్సు చేసింది. ఆయన ఆమోదించడంతో పద్మశ్రీ, రవిబాబును ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
వీరిద్దరినీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫిబ్రవరి 20న ప్రకటించారు. అప్పుడే వారిద్దరూ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి మర్యాదపూర్వకంగా సీఎం జగన్ను కలిశారు కూడా. కానీ అప్పటికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా లేవు.. గవర్నర్కు సిఫారసులు వెళ్లలేదు. గతనెల 20న శివనాథ్రెడ్డి, ఫరూక్ రిటైర్మెంట్తో ఖాళీ అయ్యాక.. రవిబాబు, పద్మశ్రీ పేర్లను రాజ్భవన్కు పంపగా.. ఆమోదం తెలియజేశారు. విజయనగరం జిల్లాకు చెందిన కుంభా రవిబాబు ప్రస్తుతం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. పద్మశ్రీ వైఎస్సార్సీపీ నేత. త్వరలోనే వీరిద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa