తిరుమల శ్రీవారి హుండీకి శనివారం భారీగా ఆదాయం వచ్చింది. నిన్న మొత్తం 82,265 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 41,300 మంది తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చినట్లు టీటీడీ స్పష్టం చేసింది. కంపార్ట్మెంట్లలో భారీగా భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సిలా తోరణం వద్ద బయటివరకు క్యూలైన్లలో నిల్చోని ఉన్నారు. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.
వీకెండ్ కావడంతో తిరుమల కోండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో కంపార్ట్మెంట్లు అన్నీ కూడా భక్తులతో నిండిపోయి కిటకిటలాడుతున్నాయి. శనివారం, ఆదివారం ఆఫీసులు, విద్యాసంస్ధలకు సెలవు రోజులు కావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. దీంతో ఈ రోజుల్లో తిరుమల కిక్కిరిసి కనిపిస్తుంది. రద్దీ దృష్ట్యా మిగతా రోజుల్లో కంటే దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. టోకెన్లు కలిగినవారు కూడా దర్శనం కోసం గంటల కొద్ది వేచి ఉండాల్సి ఉంటుంది.
కూలైన్లలో నిల్చున్నవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతుంది. భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకేసారి అందరినీ పంపించకుండా తక్కువమందిని పంపిస్తున్నారు. చిరుత దాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన అందరినీ కలిచివేస్తోంది. నడకమార్గంలో మిస్సింగ్ అయిన బాలికను చిరుత గాయపర్చి చంపేయడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో మెట్ల మార్గంలో ప్రయాణించే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో భక్తుల్లో ఆందోళన తగ్గించేందుకు టీటీడీ ప్రత్యేక రక్షణా చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 50 మందిని గుంపుగా పంపేవారు. అయితే ఇక నుంచి 100 మందిని ఒక గుంపుగా పంపుతున్నారు. వీరికి భద్రతగా ఒక పైలట్ను ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి 40 అడుగులకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే సాయంత్రం 6 తర్వాత నడకమార్గాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa