నిజానికి రాష్ట్రంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ.. వీళ్లను మించిన దండుపాళ్యం బ్యాచ్ మరేదైనా ఉందా? వీరిని మించిన స్టూవర్ట్పురం దొంగలు ఇంకెవరైనా ఉన్నారా? అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. సేవా భావంతో పని చేస్తున్న వలంటీర్లపై పవన్కళ్యాణ్ మరోసారి నోరు పారేసుకున్నాడని, విధుల నుంచి తప్పించిన వలంటీర్, ఎక్కడో పని చేస్తూ.. ఏదో నేరం చేస్తే మొత్తం వలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ అన్న పవన్ మరోసారి వారిపై తన అక్కసు వెళ్లగక్కాడని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబు కోసమే రాజకీయాలు చేస్తున్న పవన్కళ్యాణ్.. అచ్చం ఆయన మాదిరిగానే నిత్యం ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. జగదాంబ జంక్షన్లో వలంటీర్లను అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు అని సంబోధించిన పవన్, ఆ వెంటనే శవ రాజకీయం చేస్తూ.. వారిని దండుపాళ్యం బ్యాచ్ అని విమర్శించాడని ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa