ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనతోపాటే స్వాతంత్య్రం పొందిన పాక్,,,భారత్ కంటే ఒక్క రోజు ముందే దాయాది దేశంలో వేడుకలు

international |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2023, 10:28 PM

1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజు. దాదాపు వందేళ్లపాటు బ్రిటిషర్లతో పోరాడిన భారతీయులు స్వరాజ్య కలను సాకారం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ అనే కొత్త దేశం అవతరించింది. ఆ తర్వాత పాకిస్థాన్ నుంచి విడిపోయిన ఈస్ట్ పాకిస్థా్న్ బంగ్లాదేశ్‌గా అవతరించిందనేది వేరే సంగతి. పాకిస్థాన్ ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే.. భారత్ ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుపుకుంటోంది.


మన కంటే ఒక్క రోజు ముందే పాకిస్థాన్ ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి అనేక కారణాలున్నాయి. బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్‌గా ఉన్న మౌంట్ బాటెన్ బిజీ షెడ్యూల్ ప్రధాన కారణం. స్వాతంత్య్రం ఇచ్చినందుకు సూచికగా.. బ్రిటిష్ ప్రతినిధిగా ఆయన అధికారాలను ఇరు దేశాలకు బదలాయించాల్సి వచ్చింది. కరాచీ వెళ్లిన బాటెన్.. పాకిస్థాన్ అధినేతమహ్మద్ అలీ జిన్నాకు ఆగస్టు 14న అధికారాలను బదలాయించారు. మరుసటి రోజు అంటే ఆగస్టు 15న భారత్‌కు పాలనాధికారాలను బదలాయించారు.


పాకిస్థాన్ అధికారాలను బదలాయించే సమయంలో బాటెన్ ప్రసంగిస్తూ.. ‘‘కొత్త దేశమైన పాకిస్థాన్ ప్రభుత్వం రేపటి నుంచి మీ చేతుల్లో ఉంటుంది’ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆగస్టు 15నే పాకిస్థాన్ ఇండిపెండెన్స్ డే. ఆ మరుసటి ఏడాది పాకిస్థాన్ కూడా భారత్‌తో కలిసి ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాల్సింది. 1948 జులై వరకు పాకిస్థాన్‌లో రిలీజ్ చేసిన పోస్టల్ స్టాంపుల్లోనూ ఆగస్టు 15నే ఇండిపెండెన్స్ డేగా పేర్కొన్నారు.


1948 జూన్‌లో సమావేశమైన ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ నాయకత్వంలో సమావేశమైన పాకిస్థాన్ కేబినెట్ భారత్ కంటే ముందుగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతిపాదించింది. దానికి జిన్నా ఆమోదం తెలపడంతో మన కంటే ఒక్క రోజు ముందుగా ఆగస్టు 14న పాకిస్థానీలు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ నెల కూడా దీనికి ఓ కారణం. 1947 ఆగస్టు 14, 15 తేదీల మధ్య రాత్రి రంజాన్ నెలలో 27వ రోజు. దీన్ని పవిత్ర రంజాన్ మాసంలో శుభ దినంగా పరిగణిస్తారు. పాకిస్థాన్ ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి ఇది కూడా ఓ కారణం. పాకిస్థాన్ కాలమానం (పీఎస్‌టీ)తో పోలిస్తే భారత కాలమానం 30 నిమిషాలు ముందు ఉంటుంది. భారత్ ఆగస్టు 15న 00:00 గంటలకు స్వతంత్ర దేశం కాగా.. అదే సమయానికి పాకిస్థాన్‌లో టైం రాత్రి 11.30 గంటలు. దీంతో పాకిస్థాన్‌లో ఓ రోజు ముందుగానే ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa