విజయవాడలో ఈ నెల 17న తలపెట్టిన చలో విద్యుత్ సౌధ, ధర్నా పిలుపుపై పోలీసు కమిషనర్ కాంతిరాణా స్పందించారు. విద్యుత్తు ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ చలో విద్యుత్తు సౌధ, ధర్నా కార్యక్రమాలకు ప్రభుత్వం, పోలీసుశాఖ నుంచి ఎటువంటి అనుమతులూ లేవని తెలిపారు. విజయవాడలో 144 సెక్షన్, 30 పోలీసు చట్టం అమలులో ఉందన్నారు. విద్యుత్తు వ్యవస్థ అత్యవసర సేవల కిందకు వస్తుందని.. ఈ ఆందోళనలో పాల్గొనే వారిపై ఐపీసీ, ఎస్మా చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా ఆందోళనల్లో పాల్గొంటే.. వివిధ సెక్షన్ల కింద తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ఉద్యోగులు తక్షణమే ఆందోళనను ఉపసంహరించుకోవాలని కోరారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు, బయట వ్యక్తులు ప్రవేశించి హింసాత్మక ఘటనలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో బాగా విజయవాడలో 3 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ధర్నా కార్యక్రమానికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇంజినీర్ల సంఘం సంయుక్తంగా ఈ నెల 17 న చలో విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని.. వారిపై కేసుల నమోదు చేస్తామని సీపీ అంటున్నారు. విద్యుత్ సౌధ, ఆయా ప్రాంతాల్లో సుమారు రెండు వందల సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. ఉద్యోగ సంఘ నేతలకు ముందుస్తుగా నోటీసులు జారీ చేశామని.. ఈ కార్యక్రమానికి పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa