వైవీ సుబ్బారెడ్డి ముందే ఫాల్గుణ వద్దు.. జగనే ముద్దు అంటూ ఫాల్గుణ వ్యతిరేక వర్గీయులు నినాదాలతో హోరెత్తించారు. వైవీ సుబ్బారెడ్డి వాహనం ముందే వైసీపీలోని రెండో వర్గం అడ్డుపడింది. దీంతో వైవీ సుబ్బారెడ్డి రెండు వర్గాలకు నచ్చచెప్పగా.. ఆ తర్వాత సమావేశం ప్రశాంతంగా జరిగింది. కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో నియోజకవర్గ వైసీపీలోని అంతర్గత పోరు బయటపడింది.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. ఇప్పటినుంచే నేతలు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ మేరకు అధిష్టానం దగ్గర లాబీయింగ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవనే ప్రచారం జరుగుతోంది. అయితే మరికొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోరు నడుస్తోంది. ఇటీవల ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అశోక్ బాబు, మరో నేత వెంకయ్య వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మాదాసి వర్గంలోని కొంతమంది అనుచరులకు గాయాలయ్యాయి. ఆ తర్వాత మాదాసి వెంకయ్యపై అశోక్ బాబు అనుచరులు దాడికి పాల్పడటం కలకలం రేపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa