ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేతి రాతతో అద్భుతాలు,,,,ప్రతిష్టాత్మక అవార్డుల్ని దక్కించుకున్న ప్రొఫెసర్ సుస్మిత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 18, 2023, 06:05 PM

చేతిరాతతో తలరాతను మార్చుకోవచ్చు.. అవును చేతిరాతతో తలరాత మారడం ఏంటని అనుకుంటున్నారా. మీరు వింటున్నది నిజమే.. చక్కనైన చేతి రాతతో కూడా అనుకున్నది సాధించొచ్చని కొందరు నిరూపించారు. అదే కోవలో గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్ సుస్మితా చౌదరి తన చేతి రాతతో ఆల్ ఇండియా హ్యాండ్ రైటింగ్ అండ్ కాలిగ్రఫీ అకాడమీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళా రక్షణ అంశంపై పోటీల్లో ఆమె మొదటి స్థానంలో నిలిచి అవార్డును దక్కించుకున్నారు.


సుస్మిత హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె చిన్నప్పటి నుంచి విభిన్న చేతిరాత శైలులుతో కాలిగ్రఫీపై (Calligraphy) ఇష్టం పెంచుకున్నారు. అలా తన కంటెంట్‌, రాత వల్ల అవార్డుకు ఎంపికయ్యారు. నాలుగువేల మందికి పైగా పాల్గొన్న పోటీలో ఫస్ట్ ర్యాంకు వచ్చింది. అంతేకాదు ఆమె గూగుల్‌ ట్రెండ్స్‌లో కొన్ని గంటల పాటు ఉన్నారు.


చిన్నతనం నుంచి రాయటం ఇష్టం అంటున్నారు సుస్మిత. తన తండ్రి కొల్లా శ్రీనివాసరావు తనకు స్ఫూర్తి అన్నారు. కేంద్రస్థాయి సంస్థల్లో పని చేయటంతో పలు రాష్ట్రాలకు బదిలీ అయ్యేవారని.. అలా తెలుగు యాస మారిపోయిందన్నారు. తన ఓఎన్‌జీసీలో పని చేసేప్పుడు నర్సాపూర్‌లో ఉన్న సమయంలో అక్కడఓ హెడ్‌ మాస్టర్‌ తనను రాయమని బాగా ప్రోత్సహించేవారన్నారు. అలా అందంగా రాయటం నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. తనకుఏరోనాటికల్‌ స్పేసెస్‌ చదవాలనుకున్నానని.. కానీ కుదర్లేదన్నారు. చిన్నప్పటి నుంచి డ్రాయింగ్‌ వేయడం అలవాటన్నారు.


గుంటూరులోని మలినేని ఇంజనీరింగ్‌ కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌లో చేరానని.. మెటీరియల్‌ తీసుకుని చదువుకోవటం ఇష్టం ఉండేది కాదన్నారు. లైబ్రరీకి వెళ్లి సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకునే అలవాటు ఉండేదన్నారు. అలా రాస్తుంటే చేతులు నొప్పి ఉండేదని.. అయినా సరే రాస్తుంటే చాలా బావుండేదన్నారు. అలా తాను రాసిన మెటీరియల్స్‌ ఇతర బిటెక్‌ కాలేజీల్లోని విద్యార్థులు కూడా చదువుతున్నారని తనకు తెలిసిందన్నారు. ఈ విషయం తెలిసి తనకే ఆశ్చర్యం కలిగిందన్నారు. ఆ తర్వాత ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో ఎంటెక్ పూర్తి చేసినట్లు తెలిపారు.


ప్రొఫెసర్‌గా ఆర్వీ‌ఆర్ కాలేజీలో 2014 నుంచి 2018 వరకూ పనిచేసినట్లు చెప్పారు. ఏడాదిపాటు ఓ ఇంజనీర్‌ దగ్గర పనిచేసి మళ్లీ 2019లో టీచింగ్‌ వైపు వచ్చానన్నారు. 2019 ఆగష్టులో తన తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్నారు.. ఆ ఘటన తనను ఎంతో బాధిచిందన్నారు. సివిల్‌ ఇంజనీరింగ్‌ టీచ్ చేయడంతో పాటు.. సీఎస్‌సీ కూడా చెబుతానన్నారు. ప్రస్తుతం హిందూ ఇంజనీరింగ్‌ కాలేజీలో హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు సుస్మతి. తన భర్త అదే కాలేజీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారన్నారు. తమకు మూడేళ్ల కొడుకు ఉన్నాడని.. ఇంటితో పాటు కాలేజీ ప్రొఫెసర్‌ బాధ్యత, పర్సనల్‌ లైఫ్‌‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అన్నారు. భవిష్యత్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేయాలన్నదే లక్ష్యం అంటున్నారు సుస్మిత.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa