ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేస్తా,,,,నాారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 18, 2023, 06:52 PM

వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననే దానిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తానని, ఆ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచేది తానేనని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త వేసిన ఛానల్స్‌పైనా దాడి చేస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలు రాష్ట్రానికి రావట్లేదని, ఉన్నవి కూడా తరలిపోతున్నాయని విమర్శించారు.


అన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టారని, పేదలు పట్టెడన్నం తింటే జగన్ ఓర్చుకోలేకపోతున్నారని లోకేష్ ఆరోపించారు. అయితే ఇవాళ మంగళగిరి కోర్టుకు లోకేష్ హాజరయ్యారు. వైసీపీ నేతల తప్పుడు ప్రచారంపై తాను వేసిన కేసులపై న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు లోకేష్ మంగళగిరి కోర్టుకు వెళ్లారు. దీంతో నేడు యువగళం పాదయాత్రకు లోకేష్ బ్రేక్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన లోకేష్.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.


రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. రేపు ఎన్టీఆర్ జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టనుంది. అయితే త్వరలో గన్నవరంలోకి అడుగుపెట్టనున్న లోకేష్ పాదయాత్రను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం మండలానికో మాజీ ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించింది. యరపతినేని శ్రీనివాసరావుకు గన్నవరం బాధ్యతలు, ఉగ్రనరసింహారెడ్డికి బాపులపాడు బాధ్యతలు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుకు ఉంగుటూరు బాధ్యతలు అప్పగించారు. అలాగే విజయవాడ గ్రామీణ సమన్వయకర్తగా వర్మను నియమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa