ఉడిపి: పెట్రోల్ ధరలను నిరసిస్తూ కర్నాటకలో జరిగిన ఆందోళనలు లాఠీచార్జ్కు దారితీశాయి. కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలు ఉడిపిలో నిర్వహించిన బంద్లో పాల్గొన్నాయి. కాంగ్రెస్, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో.. ఉడిపి జిల్లా యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా 144వ సెక్షన్ విధించింది. ఈ నిషేధ ఆజ్ఞలు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. ఓ నిరసనకారుడు విసిరిన రాయి తగిలి బీజేపీకి చెందిన ఉడిపి సిటీ యూనిట్ ప్రెసిడెంట్ ప్రభాకర్ పూజారే తలకు గాయమైంది. దాంతో అతన్ని జిల్లా హాస్పటల్కు తరలించారు. ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ వర్కర్ల మధ్య ఘర్షణ మరింత ముదిరింది. దీంతో పోలీసులు ఆ బృందాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల లాఠీకి ఉడిపిలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రమేశ్ కంచన్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని కూడా హాస్పటల్లో చేర్పించారు. జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబార్గీ స్వయంగా రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు. గుంపును చెదరగొట్టేందుకు లాఠీకి పనిపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa