ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తులకు అలర్ట్.. 23న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 07:19 PM

తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, డిసెంబర్ 23న మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నందున, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అదే రోజు ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఈ కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవ కూడా రద్దు చేయబడింది. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa