ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని సీఎం వైయస్ జగన్ బలంగా నమ్మారు.. అందుకే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను నాలుగేళ్లలోనే పరిష్కరించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులకు సీఎం వైయస్ జగన్ ఎప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందన్నారు. ప్రజల మేలు కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేసిన దిశానిర్దేశానికి అనుగుణంగా అందరం పనిచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను ప్రజల చెంతకు చేర్చాల్సిన బాధ్యత ఉద్యోగులదే కాబట్టి వారు పనిచేసుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కల్పించారన్నారు. ఉద్యోగులకు సమస్యలు లేకుండా ఉంటే మరింత మనసుపెట్టి పనిచేయగలరని బలంగా విశ్వసించిన నాయకుడు కాబట్టే.. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa