ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతికి పాల్పడని వారిలో నేనొకడ్ని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 04:13 PM

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అసంతృప్తవాదులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మైలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, రైతులకు చెక్కుల పంపిణిలో వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలలో ఎటువంటి అవినీతికి పాల్పడని వారు ఎవరైన ఉంటే వాళ్ళల్లో తాను ఒకడనని అన్నారు. తాను ఎంత సౌమ్యంగా ఉంటాననేది ఒక ప్రక్క అయితే రెండో ప్రక్క కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భయపెట్టో మరో రకంగానో వసంత కృష్ణప్రసాద్‌ను లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదన్నారు. పదవులు ఇచ్చేదాకా నక్కవినయాలు ప్రదర్శించి ఇప్పుడు కుటిల బుద్దులు చూపుతున్నారని విమర్శించారు. వర్గాలు లేకుండా ఉండాలనుకుంటే తనకు వర్గాలను అంటగడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa