అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో బస్సు ఘాట్ రోడ్డులో నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన వారు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ఓ తల్లి తన ప్రాణాలకు తెగించి మరీ తన బిడ్డను రక్షించుకుంది. బస్సు అంత పై నుంచి కందిపడిపోయినా తల్లి మాత్రం బిడ్డను వదల్లేదు. తనకు తలకు తీవ్ర గాయమైనా పసికందును మాత్రం జాగ్రత్తగా కాపాడింది. చిన్నారి ఒంటిపై చిన్న గీత కూడా పడనివ్వకుండా రక్షించింది. తన బిడ్డ అమ్మవారి అనుగ్రహం వల్లే అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు ఆ తల్లి చెప్పుకొచ్చింది.
మరోవైపు ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. చెట్టు కొమ్మ అడ్డు రావడమే ప్రమాదానికి కారణమని డ్రైవర్ సత్తి బాబు చెబుతున్నారు. ఈ ఘటనలో నారాయణమ్మ, కొండన్న మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు. బాబూరావు, చిన్నమ్మలు, బొడిరాజు, దుర్గాభవాని, రమణ, విశాఖ లోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఐదుగురు పరిస్థితి పై మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఎప్పటికప్పుడు అరా తీస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పాడేరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాడేరు బస్సు ప్రమాదంలో గాయపడిన ఈ ఐదుగుర్ని మెడికర్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మెడికర్ ఆస్పత్రికి ఆదివారం రాత్రి తరలించారు. చికిత్స పొందుతున్నవారిని బాబూరావు, చిన్నమ్మలు, బోడిరాజు, దుర్గ భవాని, రమణగా గుర్తించారు. బస్సు ప్రమాదంలో చిన్నమ్మలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న మంత్రి అమర్నాథ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa