మొబైల్ ఫోన్లకు సమీపంలో నిద్రించడం వల్ల కలిగే ప్రమాదాలు, ఆపదల గురించి ఇప్పటికే పలు అధ్యయనాలు హెచ్చరించాయి. తాజాగా, ఐ-ఫోన్ల తయారీదారు యాపిల్ సంస్థ కూడా వినియోగదారులకు స్పష్టమైన సూచనలు చేసింది. ముఖ్యంగా ఫోన్ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్నవారు, ఛార్జింగ్ పెట్టి ఫోన్ పక్కనే ఉంచుకునేవారిని హెచ్చరించింది. ఈ సూచనలను తమ ఆన్లైన్ యూజర్ గైడ్లో చేర్చింది. ఐఫోన్లను సరైన వెలుతురు ఉన్న వాతావరణంలోనూ.. టేబుల్ల వంటి ఫ్లాట్ ఉపరితలాలపై పెట్టి ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది.
దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఛార్జింగ్ పెట్టవద్దని స్పష్టం చేసింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయని తెలిపింది. ఈ వేడిని సులభంగా విడుదల చేయలేనప్పుడు ఫోన్ కింద ఉన్న భాగం కాలిపోవడం, తీవ్రమైన సందర్భాల్లో మంటలంటుకునే ప్రమాదానికి దారితీస్తాయని తెలిపింది. అలాగే, ఫోన్ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ అడాప్టర్, వైర్లెస్ ఛార్జర్పై నిద్రపోవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్కి కనెక్ట్ చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచవద్దని స్పష్టంగా చెప్పింది.
పాడైన కేబుల్స్, ఛార్జర్లను ఉపయోగించవద్దని, తేమ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టొద్దని కూడా సలహా ఇచ్చింది. ‘మీ ఐ-ఫోన్, పవర్ అడాప్టర్, ఏదైనా వైర్లెస్ ఛార్జర్ని ఉపయోగించినప్పుడు లేదా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు బాగా వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉంచండి.. శరీరానికి వ్యతిరేకంగా వేడిని గుర్తించే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే స్థితిని కలిగి ఉంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి’ అని మార్గదర్శకాల్లో యాపిల్ సంస్థ సూచించింది. కాగా, ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వాడటమే కాదు.. సిగ్నల్ లేని సమయంలో వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనం హెచ్చరించింది కూడా. సిగ్నల్ లేకపోతే కొంత ఫ్రీక్వెన్సీలో అది తీవ్రమైన రేడియేషన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుందని, దాని కారణంగా అధిక తల నొప్పి వస్తూ ఉంటుందని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa