ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో విశ్వరూపం చూపించిన కరోనా,,,,ఆంక్షలు ఎత్తేసిన 2 నెలల్లో 20 లక్షలపైగా మృతులు

international |  Suryaa Desk  | Published : Fri, Aug 25, 2023, 09:38 PM

కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు, వార్తలు, ఆరోపణలు వచ్చాయి. అయితే చైనాలో మొదట కొవిడ్ బయటపడినా చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యేవి. ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించిన కొవిడ్ ప్రపంచాన్ని దాదాపు 2 ఏళ్ల పాటు వణికించింది. అయితే చైనాలో రెండో వేవ్‌లో మరోసారి పడగ విప్పిన కరోనా మహమ్మారి విశ్వరూపం చూపించింది. దీంతో వైరస్‌ను నియంత్రించేందుకు జిన్‌పింగ్ సర్కార్ కఠిన ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే తీవ్రమైన ఆంక్షలతో జీరో కొవిడ్ విధానాన్ని చాలా కాలం పాటు అమలు చేసింది. అయితే అటు.. చైనాలో ప్రపంచ వ్యాప్తంగా చైనా విధించిన జీరో కొవిడ్ విధానం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. రోడ్లపైకి వచ్చి చైనీయులు ఆందోళనలు చేయడంతో చివరికి ఆ జీరో కొవిడ్ విధానాన్ని రద్దు చేసింది. అయితే ఆ తర్వాతే అసలు ఘోరం జరిగింది. జీరో కొవిడ్ విధానం ఎత్తేసిన తర్వాత 2 నెలల్లోనే 20 లక్షల మందికి పైగా చైనీయులు కొవిడ్‌తో కన్నుమూశారని తాజా అధ్యయనం వెల్లడించింది.


ప్రపంచ దేశాల్లో కొవిడ్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసినా కూడా.. చైనా మాత్రం చాలా నెలల పాటు జీరో కొవిడ్‌ విధానాన్ని విధించింది. అయితే స్థానికంగా తీవ్ర నిరసనలు.. విదేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో 2022 డిసెంబర్‌లో కొవిడ్‌ ఆంక్షలను ఒక్కసారిగా ఎత్తివేసింది. దీంతో ఊహించని స్థాయిలో కొవిడ్‌ కేసులు, మరణాలు నమోదైనట్లు అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. జీరో కొవిడ్‌ పాలసీని రద్దు చేసిన తర్వాత 2 నెలల్లోనే సుమారు 20 లక్షలకుపైగా కొవిడ్ మరణాలు సంభవించి ఉండొచ్చని అమెరికా అధ్యయనం అంచనా వేసింది. అయితే కొవిడ్ మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించని డ్రాగన్.. లెక్కలు దాచిపెట్టింది.


అమెరికా సియాటెల్‌లోని ఫ్రెడ్‌ హట్‌షిన్‌సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌.. చైనాలో కొవిడ్ మరణాలపై ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందులో చైనాలోని యూనివర్సిటీలు, స్థానిక సోషల్ మీడియాల నుంచి సమాచారాన్ని సేకరించింది. చైనాలో ఉన్న అన్ని ప్రావిన్స్‌ల్లో 2022 డిసెంబర్‌ నుంచి 2023 జనవరి మధ్య కరోనా సంబంధ కారణాలతో 30 ఏళ్ల వయసు దాటిన వారిలో 18.7 లక్షల మరణాలు నమోదైనట్లు ఈ అధ్యయనం గుర్తించింది. జీరో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కొవిడ్‌ కారణంగా కేవలం ఆస్పత్రుల్లోనే 60 వేల మంది మృత్యువాత పడ్డారని.. తెలిపింది. ఇవి చైనా అధికారికంగా ప్రకటించిన దానికంటే చాలా ఎక్కువ అని వెల్లడించింది.


ఈ అధ్యయనంలో చైనాలో జీరో కొవిడ్‌ విధానానికి సంబంధించి అనేక అంశాలు వెల్లడైనట్లు రీసెర్చర్లు తెలిపారు. కొవిడ్‌ 19 వ్యాప్తికి, పౌరుల మరణాలపై ప్రభావానికి ఇలాంటి అధ్యయనం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది కొవిడ్‌ కారణంగా చనిపోయారు. అయితే చైనాలో విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఆ దేశంలో కేవలం 1.21లక్షలు మాత్రమే చనిపోయారని పేర్కొంది. అయితే చైనాలో కొవిడ్‌ మరణాలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు రావడంతో.. కొంతకాలం రోజువారీ కొవిడ్ కేసులు, మరణాల సంఖ్యను ఆ దేశం దాచిపెట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa