ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 28న జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 26, 2023, 04:23 PM

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈనెల 28న చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించనున్నారు. సోమ‌వారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఆయన నగరి చేరుకుంటారు. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి నిధులను విద్యార్థుల త‌ల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. అనంత‌రం ఏర్పాటు చేసిన‌ బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లిలోని త‌న నివాసానికి చేరుకుంటారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa